గత కొంత కాలంగా భారత దేశంలో జియో చేస్తున్న మాయాజాలంతో ఇతర నెట్ వర్క్ సంస్థల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  ప్రతి ఈవెంట్ కి ఓ ప్రత్యేక ఆఫర్ తెస్తు ఇతర నెట్ వర్క్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుంది.  తాజాగా రిలయన్స్ జియో తన అన్ని రకాల ప్లాన్లలో ఉచిత డేటా పరంగా మార్పులు చేసింది. రూ.299 లో ఇప్పటి వరకు రోజూ 3 జీబీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేయగా, ఇకపై అదనంగా ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందొచ్చు. అంటే మొత్తం మీద ప్రతి రోజూ 4.5 జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందొచ్చు.

ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో ప్రకటించింది. జియో కొత్త ప్లాన్ లో ఉచితంగా అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా ఉచితంగా పొందొచ్చు. రిలయన్స్ జియోలో రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లలో ప్రస్తుతం ప్రతి రోజూ 1.5 జీబీ లభిస్తుండగా, ఇకపై రోజూ 3జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు.

రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో 2జీబీ డేటాకు బదులు 3.5 జీబీ డేటాను రోజూ పొందొచ్చు. అలాగే, ప్రతి రోజూ 4జీబీ డేటాతో కూడిన రూ.509 ప్లాన్ లో ఇకపై ప్రతి రోజూ 5.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.799తో కూడిన 5జీబీ డేటా ప్యాక్ లో రోజూ 6.5 జీబీ డేటాను పొందొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: