టెలికం సంస్థ జియో మరో ఆఫర్ ప్రకటించింది. పోర్టబుల్ 4జీ రూటర్ ‘జియోఫై’ పై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. నిజానికి దీని అసలు ధర రూ.1999 కాగా, గతేడాది సెప్టెంబరులో ధరను రూ.999కి తగ్గించింది. ఇప్పుడీ ధరపై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించడంతో రూ.499కే జియోఫై డాంగిల్‌ను సొంతం చేసుకునే అద్భుత అవకాశం లభించింది. యోఫి డాంగిల్ తోపాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను తీసుకున్న వారికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అమలవుతుంది. ఇప్పటికే జియోఫై రూటర్‌ను ఉపయోగిస్తున్నవారు ఈ ఆఫర్‌కు అనర్హులు.

కొత్త వినియోగదారులకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఆఫర్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఎప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జియో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ‘జియోఫై’ని కొనుగోలు చేసుకోవచ్చు. జియోఫి డేటా కార్డును జియోస్టోర్లు, అమేజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ నుంచి పొందొచ్చు.

జియోఫి డాంగిల్ కొనుగోలు చేసేవారు కనీసం రూ.199తో కూడిన పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వరుసగా 12 నెలల పాటు ప్రతీ నెలా పోస్ట్ పెయిడ్ రెన్యువల్ చేసుకుంటూ వెళితే ఆ తర్వాత కస్టమర్ కు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీన్ని 13వ నెల నుంచి బిల్లుల్లో సర్దుబాటు చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: