టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా రోజు రోజుకీ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో   ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు టీసీఎల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ అల్కాటెల్ 5వి ని ఇవాళ విడుదల చేసింది. రూ.13,600 ధరకు ఈ ఫోన్ వచ్చే నెలలో వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు. 

అల్కాటెల్ 5వి ఫీచర్లు :
6.2 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, సింగిల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.



మరింత సమాచారం తెలుసుకోండి: