ప్రముఖ మొబైల్ సంస్థ ఆసుస్ నుండి జెన్ఫోన్ 5జెడ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి విడుదల అయింది. భారత మార్కెట్ లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. గతంలో మూడు వేరియంట్లలో ఒకేసారి విడుదల చేసింది.. అయితే ఇన్ బిల్ట్ స్టోరేజ్ లో సాంకేతిక లోపం కారణంగా 8జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులోకి రాలేదు. తాజాగా 8జీబీ ర్యామ్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.29999, 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.32999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ రూ.36999గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. డు వేరియంట్ల ఫోన్ ధరలు కింది విధంగా ఉన్నాయి.
తాజా అప్ డేట్ తో 8జీబీ ర్యామ్ వేరియంట్ తో పాటు 6జీబీ ర్యామ్ వేరియంట్లు కూడా ఈనెల 30 నుండి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు.