శామ్సంగ్ మొబైల్ కంపెనీ తన మొబైల్స్ ఖాతాలోకి మరొక న్యూ ప్రోడక్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.. శామ్సంగ్ కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధునాతనమైన ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది...అదే “గెలాక్సీ నోట్ 9” ఈ మొబైల్ లో ఫీచర్స్ లో చెప్పుకోదగ్గది ముఖ్యమైనది ఏమిటంటే..కృత్రిమ మేధ కలిగిన అధునాతన స్మార్ట్ఫోన్
ఈ మొబైల్ ఫోన్ లో స్క్రీన్షాట్ను వాయిస్ ద్వారా సైతం పంపగలిగే బిక్స్బితో అందుబాటులోకి వచ్చింది ఈ మొబైల్.. 6.4 అంగుళాల డిస్ప్లే తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది... 845 స్నాప్డ్రాగ్ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్లను కలిగిఉన్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. 128 జీబీ ధర రూ.67,900 కాగా, 512 జీబీ ఫోన్ ధర 84,900 ఉన్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్ అన్ని మొబైల్ రిటైల్ సంస్థలలో వివిధ నగరాలలో లాంచ్ చేసింది
హైదరాబాద్ లోని హైటెక్సిటీ బిగ్ సీ షోరూంలో సీఎండీ యం బాలు చౌదరి, సినీనటి పూజా హెడ్గే ఫోన్ను విడుదలచేశారు. సంస్థ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, జి బాలాజి రెడ్డి, అమిత్విగ్ (సేల్స్అవుట్ హెడ్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...అయితే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన గంటల వ్యవధిలోనే అధికమొత్తంలో ఫోన్స్ అమ్ముడు పోయాయిఅంటూ సంస్థ వెల్లడించింది.