స్మార్ట్ ఫోన్ పేరు చెప్తే చాలు ఇప్పుడు గుర్తుకు వచ్చేది
చైనా కంపెనీల నుంచీ వస్తున్న షావోమి, ఒప్పో, వివో, లెనోవో మొబైల్స్ గుర్తుకు వస్తాయి అయితే ఇప్పుడు ఈ మొబైల్ రంగంలోకి
మరో చైనా కంపెనీ అడుగుపెడుతోంది..అంతేకాదు వచ్చి రావడంతోనే భారతీయ కస్టమర్లని
ఆకర్షించడం కోసం కళ్ళు చెదిరే ఫీచర్స్ .డివైజ్ లతో తన మొబైల్స్ ని లాంచ్
చేస్తోంది..మిడ్
సెగ్మెంట్లో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది.
అంతేకాదు ఈ మొబైల్స్ మూడు ఏళ్ల వారంటీతో పాటు రెండు సార్లు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్కూడా అందిస్తోంది...ఈ కంపెనీ హెచ్1, హెచ్ 3, హెచ్ 5 అనే డివైస్లను విడుదల చేసింది..అయితే ఈ భారీ ఆఫర్ల వెనుక మొబైల్ రంగంలో తనదైన శైలిలో అతి తక్కువ కాలంలోనే పట్టు సాధించడమే టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తోంది..
హెచ్1 స్మార్ట్ఫోన్:
5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో 640x1280 రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 13+2 ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరః రూ .7,499,
హెచ్3 స్మార్ట్ఫోన్:
5.5అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 18.9 యాస్పెక్ట్ రేషియో, 720x1440 రిజల్యూషన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఎంటీకే 1.3 గిగాహెడ్జ్ బిట్64 , 13+2 ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రధాన ఫీచర్లు, ధర రూ .9,990అ..అయితే హెచ్1, హెచ్3 ఈ రెండు మొబైల్ లో పేస్ లాక్ ఏర్పాటు చేశారు..
హెచ్ 5 స్మార్ట్ఫోన్:
5.7 అంగుళాల హెచ్డీ డిస్ప్లే , 720x1440 రిజల్యూషన్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16 + 2 రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, ధర: రూ .10,990.
ఈ మూడు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేస్తాయి.