టెలికాం రంగంలో తమ వినియోగదారులకు రకరకాల ఆఫర్ లు ప్రకటిస్తూ సంచలనాలు సృష్టించే జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఫోన్పే యాప్ ద్వారా రూ.300 లేదా అంతకన్నా ఎక్కువ విలువ గల రీఛార్జి చేసుకుంటే రూ.50 క్యాష్బ్యాక్ పొందుతారని జియో తెలిపింది. అయితే కస్టమర్లు ఫోన్పే ద్వారా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 24 గంటల్లోగా కస్టమర్ ఫోన్పే వాలెట్కు రూ.50 క్యాష్బ్యాక్ క్రెడిట్ అవుతుంది.
ఈ క్యాష్బ్యాక్ను వినియోగదారులు రీచార్జిలకు, బిల్ పేమెంట్స్కు ఉపయోగించుకోవచ్చు. అయిన ఈ క్యాష్ బ్యాక్ను వినియోగదారులు ఇతర రీఛార్జిలకు లేదా ఏదైనా బిల్ పేమెంట్స్కు ఉపయోగించుకోవచ్చు.
తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు 100 మెసేజ్లు పంపుకొనే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్ ప్లాన్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఈ నెల 21 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.