బీఎస్ఎన్ఎల్ ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ సంస్థ టెలికం దిగ్గజంగా పేరొందిన బీఎస్ఎన్ఎల్ తరువాతి కాలంలో ఎయిర్టెల్ ,ఐడియా ల రాకతో తన ఉనికిని పోగొట్టుకుంది..క్రమేపీ బీఎస్ఎన్ఎల్ వాడకం అంచెలంచెలుగా వినియోగదారులు తగ్గించుకుంటూ వచ్చారు..అయితే ఆ తరువాత జియో రాకతో ఎయిర్టెల్ ,ఐడియా రెండూ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక చేతులేత్తేశాయి..

 Image result for bsnl 299

దాంతో జియో ఓ వెలుగు వెలిగిపోతున్న తరుణంలో ఎయిర్టెల్ మళ్ళీ పుంజుకుంటూ వస్తోంది..జియోకి దీటుగా ఆఫర్స్ ప్రవేశ పెడుతోంది అయితే తాజాగా ఈ పోటీ ప్రపంచంలో నేను కూడా ఉంటాను అంటూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా రంగంలోకి దిగింది..జియో ,ఎయిర్టెల్ కి దిమ్మతిరిగిపోయేలా ఆఫర్స్ ని ప్రకటించింది.

 Image result for jio airtel

తాజాగా బీఎస్‌ఎన్ఎల్‌ సరికొత్త పోస్ట్‌పోయిడ్‌ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది...కేవలం రూ.299 పోస్ట్‌పెయిడ్‌ రీచార్జ్‌పై నెలకు 31జీబీ 4జీ డేటాను అందిస్తోంది...అయితే ఈ ఆఫర్ ని కొత్త నియోగదారుల కోసం ప్రకటించింది...అయితే ఇందులో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, రోజులు 100ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం...దీనికి అదనంగా జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్‌ అవకాశం కూడా ఈ ప్లాన్‌లో లేదు


మరింత సమాచారం తెలుసుకోండి: