టెలికం
రంగంలో జియో ని సరికొత్తగా పరిచయం చేసి , ప్రారంభించిన ఆనతి కాలంలోనే కోట్లాది
మందిని తమ కష్టమర్లుగా చేసుకున్న జియో సంస్థ..ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ ని
ప్రకటిస్తూ పోటీలో ముందుంటుంది. జియో ఎప్పుడు ఆఫర్స్ ప్రకటించినా సరే ఎదో ఒక
ఆకర్షణీయమైన కోణంలోనే ఆ సంస్థ ఆఫర్స్ ని ప్రకటిస్తూ వినియోగ దారులని ఆకర్షిస్తూ
ఉంటుంది.
దసరా పండుగ సందర్భంగా జియో ఓ సరి కొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది..అదేంటంటే..యాన్యుయాల్ ప్లాన్ అంటే సంవత్సరం వరకూ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఒకేసారి డబ్బు చెల్లించే ఆఫర్. ఇందులో రూ.1699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది.
అయితే ఈ ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది.