పండగ వచ్చింది అంటే ఈ
కామర్స్ దిగ్గజాలు అన్నీ ఒకదాని తరువాత మరొకటి వినియోగదారులని ఆకర్షించడానికి
పోటీలు పడుతూ ఉంటాయి..ఇప్పటికే అమెజాన్ ఫ్లిప్ కార్ట్ కంటే ముందుగానే భారీ ఆఫర్స్
తో దసరా సీజన్లో దుమ్మురేపిందని అనుకుంటున్న సమయంలో ఫ్లిప్కార్ట్ దీపావళి దృష్టి పెట్ట్టింది..అలాగే అమెజాన్ ఇప్పటికే మరో
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
ప్రారంభించగా..అమెజాన్ కంటే భారీ ఆఫర్స్ తో అమెజాన్ కి దిమ్మతిరిగిపోయెలా
ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్
ఈ నేపథ్యంలో 'ఫెస్టివ్ ధమాకా డేస్' పేరుతో దీపావళి సేల్ను ప్రకటించింది. అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టుగా సంస్థ తెలిపింది..
బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగా కాకుండా ఈ ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు డెలివరీ, కస్టమర్ కేర్ లలో ప్రాధాన్యతతో పాటు అదనంగా రివార్డ్ పాయింట్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.
.