పోటీ ప్రపంచంలో ఎవరికి వారు
వినియోగదారులని ఆకట్టుకోవడానికి కళ్ళు చెదిరే ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు అది సహజమే
అయితే కేవలం దీపావళి సందర్భంగా పురసకరించుకుని Mi మొబైల్ సంస్థ వినియోగ దారులు
నమ్మేలేని విధంగా ఆఫర్లని ప్రకటిస్తోంది..నిజంగా ఎవరూ నమ్మలేని ఆఫర్లు ఈ సంస్థ
ప్రకటించే సరికి అందరి దృష్టి ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు
పై పడింది.
ఎంఐ ఆన్లైన్ స్టోర్లో ఎంఐ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్ను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నది. ఇందులో పలు షియోమీ స్మార్ట్ఫోన్లు..మొబైల్ యాక్ససరీలను కేవలం రూ.1కే ఫ్లాష్ సేల్లో విక్రయించనున్నారు. అలాగే ప్రొడక్ట్స్ కొనుగోలుపై వినియోగదారులకు రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువ గల డిస్కౌంట్ కూపన్లను కూడా అందివ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.