జియో కి
తానే సాటి తనకి ఎవరూ లేరు పోటీ అన్నట్టుగా ఉంది టెలికం రంగంగలో జియో పరిస్థితి. జియో
ధాటికి ఏ టెలికం మార్కెట్ కూడా నిలదొక్కుకునే పరిస్థితి లేదు. దాంతో అన్ని టెలికం
దిగ్గజాలు చేతులు ఎత్తేసిన తరుణంలో జియో పండగ సమయంలో వినియోగ దారుల మనసు గెలుచుకుంది.
దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
గత నెలలో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను వినియోగదారులందరికీ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మరోసారి అలా సెలబ్రేషన్స్ ప్యాక్ కింద మరో 8జీబీ డేటాను జియో తన కస్టమర్లందరికీ ఉచితంగా అందిస్తున్నది. ఈ అదనపు డేటా ఇప్పటికే కస్టమర్ల జియో అకౌంట్లోకి క్రెడిట్ అయింది.
వినియోగ దారులు “మై జియో” యాప్లోకి వెళ్లి “మై ప్లాన్” ఓపెన్ చేస్తే అందులో “సెలబ్రేషన్స్ ప్యాక్” పేరిట “2 జీబీ” డేటా కనిపిస్తుంది. అయితే వినియోగదారులకు 8జీబీ డేటా 4 రోజుల పాటు వస్తుంది. దాన్ని రోజుకు 2జీబీ చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీ వరకు ఈ డేటాను కస్టమర్లు వాడుకోవాల్సి ఉంటుందని జియో తెలిపింది.