స్మార్ట్
ఫోన్ దిగ్గజ కంపెనీ టాప్ లిస్టు లో ఒకటిగా ఉన్న శాంసంగ్ సంస్థ నుంచీ తాజాగా మరొక
కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది..ఈ ఫోన్ ని ‘డబ్ల్యూ 2019’ పేరుతో మార్కెట్ లోకి దింపనున్నారు. అంతేకాదు ఈ
సరికొత్త మొబైల్ ఫ్లిప్మోడల్ లో అందుబాటులోకి వస్తోంది..అంతేకాదు ఈ స్మార్ట్ఫోన్లో డ్యుయల్ సూపర్ డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ప్రధాన ఫీచర్లుగా
ఉన్నాయి.
అంతేకాదు ఈ మొబైల్ బాడీ మొత్తం 3డీ గ్లాస్ మెటల్ డిజైన్తో రూపొందించారు..ఈ డివైస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సరికొత్త శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్ఫోన్ ధర ఎంతో తెలుసా? సుమారు రూ.1,97060 గా ఉంది...షాక్ అయ్యారా నిజమేనండి ఈ ఫోన్ ధర దాదాపు రెండు లక్షల పైమాటేనట.
ఈ మొబైల్ ఫీచర్లు
4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్
డ్యుయల్ (ఇంటర్నల్, ఎక్స్టర్నల్) డిస్ప్లేలు
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0
ఓరియో
6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
512 జీబీ ఎక్స్పాండబుల్
స్టోరేజ్,
12+12 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3070 ఎంఏహెచ్ బ్యాటరీ