అత్యంత ఖరీదైన ఫోన్ అనగానే చటుక్కున గుర్తొచ్చేది ఐ –ఫోన్ ఈ విషయం అందరికి తెలుసు అయితే ఇప్పుడు ఐ –ఫోన్ రేటు కంటే గూబ గుయ్యిమనేలా. మొబైల్ అభిమానులకి ఆశ్చర్యం కలిగించేలా మిజు బ్రాండ్ మొబైల్ ఓ ప్రత్యేకమైన ఫోన్ ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచపు మొట్టమొదటి హలోలెస్ ఫోన్ దీని పేరు “మిజు జీరో”..ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై మార్కెట్ లో దొరుకుంతుంది. దీని ఖరీదు అక్షరాలా
1,299 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.92,000 లు ప్రముఖ క్రౌడ్ఫండింగ్ ఫ్లాట్ఫామ్ ఇండిగోగో ద్వారా ఈ డివైస్ను ఆర్డర్ చేసుకోవచ్చు.ఈ ఫోన్ లో పత్యేకతలు ఏమిటంటే పోర్ట్స్, బటన్స్ అనేవి కనిపించవు. ఇదే సమయంలో ఈ ఫోన్లో ఎటువంటి హోల్స్ కూడా ఉండవు. అత్యాధునికమైన టెక్నాలజీ తో రూపొందిన ఈ ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.
మార్చి 1వ తేదీతో ఈ ఫోన్ కొనుగోలు ఆగిపోనుంది. కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో తీసుకువచ్చింది ఈ కంపెనీ అయితే ఇప్పటికే ఈ ఫోన్ లలో 16 యూనిట్లు బుక్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.సామ్సంగ్ గెలాక్సీ స్9 తరహాలో మిజు జీరో కూడా కర్వుడ్ సైడ్స్, సిరామిక్ బాడీ, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో స్లిమ్ టాప్ ఇంకా బోటమ్ బిజెల్స్ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్లో 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్ప్లేను హౌస్ చేసారు. ఈ డిస్ప్లేలో ఇన్బిల్ట్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్విప్ అయ్యి ఉంటుంది. ఈ స్ర్కీన్ ఎమ్సౌండ్ 2.0 అనే టెక్నాలజీని ఉపయోగించుకుని హై-క్వాలిటీ సౌండ్ను రిలీజ్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా అ ఫోన్ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. సిమ్ కార్డ్ స్లాట్ స్థానంలో ఈ-సిమ్ స్లాట్ను ఉపయోగించుకోవల్సి ఉంటుంది.మొత్తానికి ఈ ఫోన్ మాత్రం టెక్ ప్రపంచం లో హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి.