ప్రస్తుత
ఎలెక్ట్రానిక్ రంగంలో మొబైల్ ప్రత్యేకత అంతా ఇంతా కాదు, గతంలో మొబైల్ ఫోన్ ల మధ్య
లేటెస్ట్ ఫీచర్స్ ని అందుబాటులోకి తేవాలంటే చాలా సమయం పట్టేది కాని, ప్రస్తుత పోటీ
ప్రపంచంలో నేరోజులకి ఒక మోడల్ మార్కెట్ లోకి రావడంతో వినియోగ దారులు ఎలాంటి మొబైల్
తీసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే పేరు తెలియని కంపెనీల కంటే కూడా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పైనే వినియోగ దారులు దృష్టి పెడుతున్నారు. దాంతో ఒకనాటి టాప్ మొబైల్ కంపెనీ అయిన సోని సైతం ఇప్పుడు మార్కెట్ లోకి తన కొత్త మొబైల్స్ ని విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీ తో ఈ మొబైల్ ని విపణిలోకి దింపాలని చూస్తున్నాయి.
ఇదిలాఉంటే ఇప్పుడు సోని ఎంట్రీ తో మిగిలిన పోటీ కంపెనీలు , వినియోగదారులు సైతం సోనీ కొత్త మొబైల్స్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నెల 25వ తేదీన స్పెయిన్లోని బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019 ప్రదర్శనలో భాగంగా సోనీ తన నూతన ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంలోనే సోనీ “ఎక్స్పీరియా ఎక్స్జడ్4” ఫ్లాగ్ షిప్ ఫోన్తోపాటు, ఎక్స్పీరియా ఎక్స్ఏ3, ఎక్స్ఏ3 అల్ట్రా, ఎల్3 ఫోన్లను కూడా విడుదల చేసి మరో సారి మార్కెట్ ని కొల్లగొట్టాలని చూస్తోంది.