స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి రోజు రోజుకి సరికొత్త టెక్నాలజీతో
విడుదల అవుతున్నాయి. ఇప్పుడు భారత మార్కెట్ లో ఓ ప్రభంజనం సృష్టిస్తున్న కంపెనీలలో
ఒకటైన వీవో ఇప్పుడు తన సరికొత్త మొబైల్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ Vivo
V15 Pro సరికొత్త ఫోన్ లో ప్రత్యేకత ఏమిటంటే . ఈ ఫోన్
లో పాపప్ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఆకట్టుకోబోతోంది.
ఈరోజు నుంచీ ఈ ఫోన్ బుకింగ్ మొదలు కాబోతున్నాయి. ఈ ఫోన్ ధరని రూ.28,990 గా నిర్ణయించారు.మార్చ్ 6వ తేదీ నుంచి Amazon. in, Flipkart, Paytm Mall, Snapdeal, మరియు Vivo India online store లో సేల్స్ మొదలు కాబోతున్నాయి. టోపాజ్ బ్లూ , రూబీ రెడ్ కలర్స్లో 6 జీబీ ర్యామ్ తో ఈ ఫోన్ కొనుగోలు దారులకి లభ్యం కానుంది.
ఇక ఈ స్క్రీన్ టు బాడీ రేషియో 91.24 శాతం ఉన్నందున ఫోన్ డిస్ప్లే పూర్తిగా అంచల వరకూ విస్తరించి వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్లో పై భాగంలో డిస్ప్లే కింద మైక్రో స్లిట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ను ఏర్పాటు చేశారు. అందువల్ల దాంట్లో ఉండే 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూజర్ కావాలనుకున్నప్పుడు పైకి ఓపెన్ అవుతుంది. దాంతో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు...దీంట్లో మొత్తం 3 రకాల కెమెరాలు ఉన్నాయి. అందులో
48MP+12MP+5MP rear cameraతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు. అంతే కాకుండా సెట్టింగ్స్ అడ్జెటమెంట్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. షార్ప్ నెస్...బ్రైట్ నెస్ విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు ధీటుగా వచ్చింది. Snapdragon 675 CPUతో పాటు 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వచ్చింది. ఆండ్రాయిడ్ 9.0 పై తో ఈ ఫోన్ యూజర్లను అలరించనుంది.