వన్ ప్లస్ వన్, యాపిల్ తరువాత అంతటి మార్కెట్ ని సంపాదించుకున్న ఏకైక
స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ వన్. చైనా కి చెందిన మొబైల్ సంస్థ తయారీదారు, ప్రేమియం
స్మార్ట్ ఫోన్ మేకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ తాజాగా తన లేటెస్ట్
స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
అమెజాన్ లో సమ్మర్ సేల్ లో భాగంగా వన్ప్లస్ 6టీ, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9వేల కి తగ్గించి మార్కెట్ లో ప్రవేశ పెట్టింది. మరొక విషయం ఏమిటంటే. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ని కొన్న వారికి మరొక 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ లెక్కలో ఈ మొబైల్ పై మొత్తం ఆఫర్ రూ.10500 లుగా తగ్గుతోంది.
గతంలో అమెజాన్ ఫ్యాబ్ సెల్ లో సుమారు రూ.3వేలు తగ్గించిన ఈ సంస్థ తాజాగా మరొక తగ్గింపుని ప్రకటించడంతో ఈ మొబైల్ పై సేల్స్ మరింత పెరిగాయని అంటున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు వన్ ప్లస్ 6టీ మొబైల్ ధర తగ్గిమ్పులతో కలుపుకుని రూ.31,499లకు లభిస్తోంది.