నెట్
వర్క్ రంగంలోకి జియో వచ్చిన నాటి మొదలు నేటి వరకూ అగ్రగామిగా తన హవా కొనసాగిస్తూనే
ఉంది. జియో కి పోటీగా ఏ టెలికం కూడా తమ సేవలని అందించలేక పోవడం గమనార్హం. ఈ
క్రమంలోనే జియో ఊహించని స్థాయిలో భారీ ఆఫర్ల తో తన నెట్ వర్క్ ని
విస్తరించింది. ఎప్పటికప్పుడు సరికొత్త
ఆఫర్స్ ని ప్రకటిస్తూ తన వినియోగదారులని ఆకర్షిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా జియో తన కస్టమర్ల కోసం మరొక శుభవార్త తెలిపింది. తమ వినియోగదారులకు అందించేజియో ప్రైమ్ మెంబెర్ షిప్ ని మరో ఏడాది పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జియో వినియోగదారులు జియో టీవీ , జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి అనేకరకాల సేవలని ఉచితంగా పోడవచ్చు. అందుకు గాను 99 రూపాయల ప్రైమ్ మెంబెర్ షిప్ ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
అయితే జియో అందించే ఈ ఉచిత సౌకర్యం పొందాలంటే ఆటో రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది పొందాలంటే ముందుగా మై జియో యాప్ లోకి వెళ్లి, ప్రైమ్ మెంబెర్ సభ్యతంలో ఆటో రెన్యువల్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఇదిలాఉంటే జియో ఇచ్చిన ఈ భారీ ఆఫర్ తో జియోతో పోటీ పడే నెట్వర్క్ సంస్థలకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
.