ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కళ్ళు చెదిరే డిస్కౌంట్స్ తో మన ముందుకు వచ్చేసింది. మొబైల్ ఫోన్స్ అతి తక్కువ ధరకే  అందుబాటులోకి రానున్నాయి.  ఇందులో భాగంగా వివిధ స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. మే 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మంత్ ఎండ్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు.


అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ను రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.91,900. నోకియా 5.1 ప్లస్ (3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ) ధర రూ.8,199 . 


హానర్ 9ఎన్ ధర రూ.8,499గా, హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) ధర రూ.11,999గా, నోకియా 6.1 (3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ) ధర రూ.6,999గా ఉంది. ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.  అయితే మే 31 తరువాత ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండవని గమనించగలరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: