టెలికాం సంస్థ జియో సంచలనాలకి కేరాఫ్ అడ్రస్స్ అనే చెప్పాలి. తన స్థాయిలో పోటీ పడేలా మరే టెలికాం సంస్థ ఇవ్వలేనట్టుగా జియో ఆఫర్స్ ని ప్రకటించడం కొత్తేమి కాదు. తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ కి గాను అన్ని క్రికెట్ మ్యాచ్ లని హాట్ స్టార్ లో ఉంచిటంగా చూసేందుకు వీలు కల్పిస్తోంది. అయితే అందుకు గాను జియో కస్టమర్లు కేవలం రూ.251 ప్యాక్‌ను రీచార్జి చేసుకోవాలి.

 

ఈ రీచార్జ్ తో జియో టీవీ యాప్ ద్వారా హాట్ స్టార్ యాప్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు అన్నిటినీ ఉచితంగా వీక్షించ వచ్చు. అంతేకాదు రూ. 365 విలువైన  బెనిఫిట్స్ కూడా ఈ ప్యాక్ తో జియో వినియోగ దారులకి అందుతాయని తెలిపింది.

Image result for jio 251 recharge

అయితే రూ.251 రీచార్జ్ తో వినియోగ దారులకి 51 రోజులు పాటు రోజుకి  2 జీబీ డేటా చప్పున మొత్తం 102 జీబీ డేటా ఫ్రీ గా లభిస్తుంది. అంతేకాదు రోజుకో కాంటెస్ట్ తో జియో వినియోగ దారులు బహుమతులు కూడా పొందేలా అవకాశాలని ఇస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: