పంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనపు అమ్మకాలను నమోదు చేస్తోంది. టాప్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ లకు ధీటైన సవాల్ విసురుతూ మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది. అదే ఊపులో ఈ కంపెనీ నుంచి ఇప్పుడు మార్కెట్లోకి అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్ వ‌చ్చేసింది.


అయితే తాజాగా రెడ్‌మీ కె20 ప్రొ పేరిట షియోమీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌ తదితర పవర్‌ఫుల్‌ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్సల్‌ భారీ కెమెరా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్‌ పాపప్‌ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఏర్పాటు చేశారు. 


ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.27,999 ఉండగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.30,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంఐ హౌం స్టోర్‌లలో ఈ నెల 22వ తేదీ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్ ఉన్నాయి.


అలాగే 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలు, 20 మెగాపిక్సల్‌ పాపప్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ తదితర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: