టెక్నాలజీ రోజుకో రకంగా మారిపోతోంది. ఈ రోజు కొన్న మొబైల్ కొన్ని రోజులకే మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తోంది. ఫీచర్స్ పెరిగే కొద్దీ మొబైల్ ధర కూడా అమాంతం పెరగడంతో వినియోగ దారులు ఆధునాత ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ని కొనుగోలు చేయలేక పోతున్నారు. కనీసం ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలన్నా, టీవీ కొనాలన్నా సరే కొనలేని పరిస్థితి. మరి అలాంటి మొబైల్ , టీవీ లు అసలు ధరకంటే కూడా సగం ధరకే వస్తుంటే కొనకుండా ఉండగలమా...

 Image result for mi turns 5

ఇప్పుడు అలాంటి భంపర్ ఆఫర్ షావోమీ అందిస్తోంది. 'ఎంఐ టర్న్స్ 5' పేరుతో భారీ సేల్ ఏర్పాటు చేసింది. ఈ సేల్ రెండు రోజుల పాటు జరగనుంది.జులై 25 తో ఈ సేల్ చివరి రోజుగా ప్రకటించింది. ఈ సేల్ చివరి రోజున చివరి రోజు రెడ్‌మీ Y3స్మార్ట్‌ఫోన్‌, ఎంఐ బిజినెస్ క్యాజ్యువల్ బ్యాక్‌ప్యాక్, ఎంఐ సౌండ్‌బార్, ఎంఐ 32 అంగుళాలటీవీలని సగం ధరకే అమ్ముతోంది.      

 Image result for mi turns 5

జులై 25 సాయంత్రం 4 గంటలకి జరిగే సేల్ లో రూ.9,999 విలువైన రెడ్‌మీ Y3 స్మార్ట్‌ ఫోన్‌ ను రూ.4999.50 ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 999 విలువగల MIబిజినెస్ క్యాజువల్ బ్యాక్‌ప్యాక్‌ను రూ.499.50 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు సాయంత్రం 6 గంటలకు జరిగే సేల్ లో సుమారు  రూ.4,999 విలువైన సౌండ్ బార్ ని కేవలం 2499.50 ధరకి పొందచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: