ఒక మెసేజ్‌ వాట్సప్‌లో ఎక్కువసార్లు ఫార్వార్డ్‌ చేయబడితే అది వినియోగదారుడికి తెలిసేలా వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'ఫ్రీక్వెట్లీ ఫార్వాడెడ్‌' పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో అనేక సార్లు ఫార్వాడ్‌ చేసిన మెసేజ్‌ను గుర్తించొచ్చు. ఎక్కువసార్లు ఫార్వాడ్‌ చేయబడిన మెసెజ్‌లు 'రెండు బాణాల చిహ్నం'తో కనిపిస్తాయి. భారతదేశంలో వాట్సాప్‌ కి 400 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. కొత్త ఫీచర్‌లోని అంశాలివి...

1, మెసేజ్‌ను ఇతరులకు తరచుగా ఫార్వాడ్‌ చేస్తే యూజర్‌కు నోటిఫికేషన్‌ కూడా వస్తుంది. ఐదు కంటే ఎక్కువసార్లు ఫార్వాడ్‌ చేసినప్పుడు మాత్రమే ఈ లేబుల్‌ కనబడుతుంది.
2, మెసేజ్‌లు సుదీర్ఘంగా ఉంటే యూజర్‌ దానిని చదివేందుకు వీలుగా 'ట్యాప్‌' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
3, గ్రూప్‌ చాట్స్‌లో యూజర్‌ ఇబ్బందులు పడకుండా, దీన్ని రూపొందించారు.
\4, వాట్సాప్‌ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో నకిలీ వార్తలను గుర్తించడం, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకుండా ఆపడం తేలిక అవుతుంది.

ఈ ఏడాది చివరి నాటికి చెల్లింపు సేవ అయిన 'వాట్సాప్‌ పే'ను భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వాట్సాప్‌ ప్రతినిధులు అంటున్నారు. 
గత ఏడాది  వాట్సాప్ ఐఓఎస్ , అండ్రాయిడ్  వెర్షన్లలో ‘డిస్మిస్ యాజ్ అడ్మిన్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. అడ్మిన్‌గా ఉన్న వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించకుండానే.. అతడికున్న అడ్మిన్ రైట్స్ తీసేయొచ్చు. ఈ ఫీచర్ అండ్రాయిడ్ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: