ఈ ప్రపంచానికి ముంచుకొస్తున్న ముప్పు గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.ఒకవైపు పెరుగుతున్న భూ తాపం,కరుగుతున్నహిమానీనదాలు,పర్యావరణాన్ని అస్థిర పాల్జేస్తున్నకర్బన కాలుష్యాలు.ఇవే గాక ఆకాశంలో భారీ గ్రహశక లాలు భూమి వైపు దూసుకొస్తున్నాయట.శాస్త్రవేత్తలు అప్రమత్తమైతేగానీ,భూమిని రక్షించ లేమని ఇప్పటికే నిపుణులు హెచ్చ రిస్తున్నారు.ఈ నేపథ్యంలో నాసా కీలక చర్యలు చేపబట్టబోతుందని సమాచారం..భూమికి ఏదో ఒకరోజు గ్రహశకలాలవల్ల భారీ ముప్పు వాటిల్లుతుంద ని పరిశోధకులు ఎప్పటినుండో తెలుపుతున్నారు.అదేగనుక జరిగితే భూమిలో సగం ప్రాణులు అంతరి స్తాయని హెచ్చరించారు.అందుకు ఉదాహరణగా ఇటీవల కొన్ని గ్రహశక లాలు భూమికి దగ్గరగా వచ్చి భయపెట్టాయని చెప్పారు,మన అదృష్టంకొద్ది అవి దిశ మార్చుకోవడంతో గండం నుంచి గట్టెక్కాం.కానీ,అసలు ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వీటితో ఎప్పటికైనా ప్రమాదం తప్పదని వెల్లడిస్తున్నారు.



ఈ విషయం పై స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ మరికొన్ని భారీ గ్రహశకలాలు భూమిని లక్ష్యంగాచేసుకుని దూసుకొస్తున్నాయని,అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని,దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత శక్తి, సామర్థ్యం మన వద్ద లేవని వెల్లడించారు.ఇక అవి ఎప్పుడు ఎక్కడ కూలతాయనేది పరిశోధకులు కూడా పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA),ఐరోపా స్పేస్ ఏజెన్సీ(ESA)లు సంయుక్తంగా ఓ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ మేరకు రెండు సంస్థల పరిశోధకులు, స్పేస్‌క్రాఫ్ట్ ఇంజినీర్లు వచ్చేవారం రోమ్‌లో సమావేశం అవుతున్నారు.ఈ మీటింగ్‌లో గ్రహశకలాలను దారిమళ్లించడం,భూమిని రక్షించే సాంకేతిక విధానాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.



ఇక ఈ మిషన్‌కు ‘ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ డిఫ్లెక్షన్ అసెస్‌మెంట్ (AIDA)అని పేరు పెట్టారు..భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశక లాన్ని అడ్డుకొనేందుకు రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపుతారు.అందులో ఒక స్పేస్‌క్రాఫ్ట్ ఆ గ్రహశకలాన్ని ఢీకొట్టి ముక్కలు చేస్తుంది.రెండో ఎయిర్‌క్రాఫ్ట్ విధ్వంసం తర్వాత అక్కడి పరిస్థితిని భూమిపై ఉండే పరిశోధకులకు వివరి స్తుంది.ఈ విధ్వంసం వల్ల గ్రహశకలం ఇసుక,రాళ్లలా విచ్ఛిన్నం అవుతుందని,దీనివల్ల భూమికి ముప్పు తప్పుతుందని భావిస్తున్నారు. అయితే,గ్రహశకల పరిమాణం పెద్దదిగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై పరిశోధకులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం 2000 QW7 అనే గ్రహశకలం భూమికి 5 మిలియన్ మైళ్ల దూరంలో నుండి గంటకు 23 వేల కిమీల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని,సెప్టెంబర్ 14న ఇది భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు.



ఆ తర్వాత కూడా దాని గమనం భూమి దిశగా సాగితే ప్రమాదం మాత్రం తప్పదని భావిస్తున్నారు.అంతేకాకుండా‘అపోఫిస్‌’అనే గ్రహశకలం ఏప్రిల్‌ 13,2029న భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని పరిశోధకులు అంచనా వేశారు.ఇది ప్రస్తుతం భూమికి 23,363 మైళ్ల దూరం నుంచి బహుశా తన దిశ మార్చుకోవచ్చు లేదా భూమి వైపు దూసుకురావచ్చు. ఒక వేళ ఇది గనుక భూమిని ఢీకొడితే 15,000 వేల అణుబాంబుల శక్తి విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు.ఇక ఈ గ్రహశకలానికి ఈజిప్టు దేవుడు ‘గాడ్‌ ఆఫ్‌ చవోస్‌’అనే పేరు కూడా పెట్టారు.మరి మానవుడు చేస్తున్న తప్పిదాలతో ముంచుకొస్తున్న ముప్పునుండి ఎంత వరకు తనను తాను కాపాడుకుంటాడో,లేక ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనలేక చేతు లెత్తేస్తాడో తెలియని పరిస్దితుల్లో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం.ఇందులో మనవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: