మోటొరొలా కంపెనీ భారత్లో తొలిసారిగా స్మార్ట్ టీవీని అందుబాటులో తెచ్చింది. ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో కంపెనీ తన మొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీని భారతదేశంలో విడుదల చేసింది. అంతే కాకుండా మరో కొత్త స్మార్ట్ఫోన్ కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మొటోరొలా ఆండ్రాయిడ్ 9.0 స్మార్ట్ టీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుంది. మోటరోలా యొక్క కొత్త స్మార్ట్ టీవీలు 30W ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లతో పాటు, డిటిఎస్ ట్రూసరౌండ్, డాల్బీ ఆడియో మద్దతుతో ఉండనుంది.
మరియు ఆండ్రాయిడ్ 9పై పుట్-ఆఫ్-బాక్స్లో నడుస్తాయి. స్పెక్స్ ద్వారా వెళితే, టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే పూర్తి - HD లేదా 4K రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉన్న వివిధ మోడళ్లను కలిగి ఉంది. 32 నుంచి 65 అంగుళాల సైజుల్లో లభించే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ఆరంభమవుతాయని మొటొరొలా మొబిలిటీ ఇండియా హెడ్ ప్రశాంత్ మణి చెప్పారు.
అలాగే ఈ స్మార్ట్ టీవీతో పాటు మోటొ ఈసిక్స్ఎస్ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొ న్నారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హెలియో పీ22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ అడిషనల్ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. దీని ధర రూ. 7,999.