పబ్ జీ... లాంచ్ అయిన రోజు నుంచి యువతను ఊపేస్తున్న ఆట. ఏంటో చూద్దాం అని మొదలు పెట్టిన వాళ్లని కూడా ఇంకోసారి చూడకుండా ఉండలేని విధంగా మార్చేసిన ఆట. దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసిన ఆట. గత సంవత్సరం ప్లే స్టోర్ లో బెస్ట్ గేమ్ ఆఫ్ ద ఇయర్-2018 అవార్డును కూడా పబ్ జీ గెలుచుకుంది. లాంచ్ అయిన సంవత్సరంలోనే పబ్ జీ ఈ ఘనత సాధించిందంటే గేమింగ్ ప్రియుల్లోకి ఈ ఆట ఎంతలా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.మరి పబ్ జీని మరిపించే ఆటే లేదా?పై ప్రశ్నకు సమాధానం దొరకడానికి మరెంతో కాలం మీరు వేచి ఉండక్కర్లేదు.

ఎందుకంటే యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ‘Call Of Duty’ మొబైల్స్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి కాల్ ఆఫ్ డ్యూటీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ కు అందుబాటులోకి రానుంది. పీసీ గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పీసీల్లో కాల్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడో సూపర్ హిట్. అందుకే ఈ గేమ్ ఎప్పుడు మొబైల్స్ లోకి వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇది ఎలాంటి ఆట అంటే.. పబ్ జీ తరహాలో ఇది కూడా బ్యాటిల్ రాయల్ గేమే. పబ్ జీలో ఎరాంగిల్, మిరామిర్, సాన్ హాక్, వికెండీ మ్యాప్ లు ఉన్నట్లు.. ఇందులో క్రాష్, హైజాక్డ్, న్యూక్ టౌన్ అనే యాప్స్ ఉంటాయి. అంతేకాకుండా టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్, సెర్చ్ అండ్ డిస్ ట్రాయ్ అనే గేమ్ ప్లే మోడ్ లు కూడా ఉంటాయి. వినియోగదారులకు మునుపెన్నడూ చూడనటువంటి వినూత్నమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తామని కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ను రూపొందించిన యాక్టీవిజన్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

ఈ గేమ్ కావాలి అనుకునే వారు ముందు కంపెనీ వెబ్ సైట్ లో ప్రీ-రిజిస్టర్ చేసుకోవాలి. చైనా మెయిన్ ల్యాండ్, వియత్నాం, బెల్జియం దేశాల్లో తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల్లో కాల్ ఆప్ డ్యూటీ గేమ్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్లేస్టోర్ లో, ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ లో ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకుని ఆడటం మొదలుపెట్టేయవచ్చు.గేమ్స్ వ్యసనం కానంతవరకు మంచిదే..కానీ వ్యసనం అయితే మాత్రంఏమీ చెయ్యలేని స్థితి..


మరింత సమాచారం తెలుసుకోండి: