షావోమి నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. రెడ్‌మి 8ఏ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను భార‌త‌దేశంలో సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల చేసింది. ఇది గతంలో విడుదలైన రెడ్ మీ 7ఏకు అప్‌గ్రేడ్ వర్షన్.  రెడ్ మీ 7ఏ విడుదలైన మూడు నెల‌ల‌కే రెడ్‌మీ 8ఏ విడుద‌ల చేయ‌డం విశేషం. అలాగే ఇండియాలో తొలిసారిగా రెడ్‌మీ 8 సిరీస్‌ లాంచ్ చేసింది. బడ్జెట్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.


ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే..  రెడ్‌మీ 8ఏ 6.22 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్,  నాచ్ డిస్‌‌ప్లే, 2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరాతో ల‌భిస్తుంది. రెండు వేరియంట్లలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 30 నుంచి  విక్రయానికి ల‌భ్య‌మ‌వ‌నుంది. అలాగే మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ, సన్‌సెట్ రెడ్ క‌ల‌ర్స్‌తో రెడ్ మీ 8ఏ ఉండ‌నుంది.


అదే విధంగా ధ‌ర విష‌యానికి వ‌స్తే.. రెడ్ మీ 8ఏ 2జీబీ + 32జీబీ రూ.6,499 నిర్ణ‌యించ‌గా.. 3జీబీ + 32జీబీ రూ.6,999 నిర్ణ‌యించారు. రెడ్ మి 8ఏ పేరుతో పిలిచే ఈ మోడల్‌ మొట్టమొదట భారతీయ మార్కెట్లో విడుదల కావడం గమనార్హం. వాస్తవానికి షావోమి సంస్థ విడుదల చేసే దాదాపు అన్ని ఫోన్లు మొట్టమొదట చైనా మార్కెట్‌లో రిలీజ్‌ అయిన తర్వాత ఇండియాలో ప్రవేశించటం జ‌రుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ఆ సారి ఇండియాలో లాంచ్ చేయ‌డం విశేషం.  



మరింత సమాచారం తెలుసుకోండి: