ఇప్పుడు మార్కెట్ లోకి కుప్పలు తెప్పలుగా రోజుకో కంపెనీ పేరుతో స్మార్ట్ ఫోన్ లు వచ్చేస్తున్నాయి. కంపెనీ పేరు చెప్పాలంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ  శాంసంగ్‌ మొబైల్ గురించి తెలియని వాళ్ళు బహుశా ఈ టెక్ ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. శాంసంగ్‌ బ్రాండ్ మొబైల్ కి అంత క్రేజ్ ఉంది. తమ వినియోగ దారుల అభిరుచులు తెలుసుకుంటూ, మార్పు చెందుతున్న కాలానికి టెక్నాలజీ కి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లని సిద్దం చేయడంలో శాంసంగ్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ అధునాతన టెక్నాలజీతో ఫోల్డ్ ( మడత ) ఫోన్ ని ప్రవేశపెట్టింది.

 

శాంసంగ్‌ కి చెందిన మడత పెట్టగలిగే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ని అక్టోబర్ 1 నుంచీ భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ మొబైల్స్ అదే రోజు నుంచీ వినియోగ దారులకి అందుబాటులోకి రానున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ ఫోన్ ధర తెలిస్తే మాత్రం కళ్ళు గిర్రున తిరగక మానదు. ఈ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా..

 

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ ధర సుమారు 1.50 లక్షల నుంచీ రూ 1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే. కేవలం ఈ ఫోన్ విక్రయం ఫ్రీ –బుకింగ్ ద్వారా మాత్రమే బుక్ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. అయితే ఈ ఫోన్ తాకే తెర 7.3 ప్రైమరీ డిస్ప్లే కాగా 4.6 ఇంచుల తో సెకండరీ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. అంతేకాదు 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమెరా , మరిన్ని ఫీచర్స్ తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: