ఈ మధ్యకాలంలో పండుగలు వచ్చాయంటే చాలు ఈ కామర్స్ సైట్స్ లో భారీగా ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. మాములు సమయంలో 15 వేలు ఉన్న ఫోన్ ధర ఆఫర్ సమయంలో 7వేలకి లేదా 8 వేలకు వచ్చేస్తుంది. అందుకే అందరూ ఎన్ని కొత్త రకాల వస్తువులు వచ్చిన ఆఫర్ వచ్చే వరుకు ఆగి మరి కొంటారు. 


అయితే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. భారత మార్కెట్‌లో 55 అంగుళాల శాంసంగ్ ఫ్రెమ్ క్యూఎల్‌ఈడీ టీవీల ధరలను భారీగా తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ ఫ్రెమ్ క్యూఎల్‌ఈడీ టీవీ ప్రస్తుత ధర 1,19,999 కాగా, దానిపై 35000 తగ్గించి, 84990కే అమ్మాలని నిర్ణయించింది. 


ఈ డిస్కౌంట్ ధరను, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరిపే అమ్మకాల్లో ఈ ఆఫర్  అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీవీలను కొనుగోలు చేయవచ్చని శాంసంగ్ ప్రకటించింది. ఎటువంటి ఈఎంఐ ఛార్జీలు లేకుండా నెలకు కేవలం 3541 చెల్లించి టీవీని కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: