మొబైల్ దిగ్గజమైన నోకియా మరో సారి భారత మార్కెట్ లో తమ సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఈ మేరకు మళ్ళీ మార్కెట్ లో పుంజుకునేలా తన మొబైల్స్ ని లేటెస్ట్ ఫీచర్స్ లో లాంచ్ చేయడమే కాకుండా భారీ తగ్గింపు కూడా ఇస్తోంది. తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ అందిస్తున్న నోకియా మొబైల్స్ కి ఇప్పుడు మాంచి ఘిరాకీ ఏర్పాడింది.

 

నోకియా 3.2 ,2.2 స్మార్ట్ ఫోన్లని ఈ సంవత్సరం మేలో మార్కెట్ లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ల ఫై భారత మార్కెట్ లో ధరలని తగ్గించింది.  నోకియా 3.2 కి చెందిన 2 జీబీ ర్యామ్ ,16 జీబీ మెమరీ ధర గతంలో రూ. 8,990 కాగా ఇప్పుడు ప్రస్తుత ధర రూ. 7,499 గా అయ్యింది.  అలాగే  3  జీబీ ర్యామ్ , 32  జీబీ మెమరీ గల స్మార్ట్ ఫోన్ రూ. 10,790 కాగా ప్రస్తుతం ఈ ఫోన్ ధరని రూ .8,499 గా ప్రకటించింది.

 

ఇదిలాఉంటే నోకియా 2.2 కి చెందిన 2 జీబీ ర్యామ్ ,16 జీబీ మెమరీ ధర రూ.6,999 ఉండగా , ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 6,599 గా ఉంది. అలాగే 3  జీబీ ర్యామ్ , 32  జీబీ మెమరీ గల స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999  గా ఉండగా ప్రస్తుతం దీని ధర రూ. 7,599 గా నిర్ధారించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: