సమాజంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కానీ ఆ పిచ్చి ముదిరితే మాత్రం నష్టమే. ఏదైన లిమిట్ దాటనంత వరకే సుఖం. శృతి మించితే కష్టం, నష్టం. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు, ఆ కాలంలోలాగా టైం చూసుకుని, ఏ అర్ధ రాత్రో, అపరాత్రో జరగడం లేదు. దోంగోడి మూడును బట్టి దొంగతనాలు చేసే రోజులు కావు. అవకాశం చిక్కిందా చేతివాటం చూపించడమే. ఇక దోచుకెళ్లడానికి, నగా, నట్రా కావలసిన అవసరమే లేదు. చేతిలో సెల్ ఫోన్ ఉన్న చాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ కొట్టేయడం చాలా సులువు. అది గాక ఎంత గరీబు వాడైనా మినిమం పదివేయిల ధరగల సెల్ మెయింటెన్ చేస్తున్నారు.

 

 

ఇకపోతే ఈ సెల్ ఫోన్ ప్రతి వారి పాకెట్‌లో ఉండదు. ఉంటే చెవిదగ్గర, లేదా సెల్ఫీ ప్లీజ్ అంటూ చేతిలో. ఇది చాలదా దొంగలకు ఈజీగా దొబ్బేయడానికి. అందుకే ఎక్కువగా కష్టం, శ్రమ లేకుండా దొంగిలించే వస్తువు సెల్ ఫోన్ అయ్యింది కాబట్టి దీన్ని ఎక్కడపడితే అక్కడ నొక్కేస్తున్నారు. ఇక సెల్ ఫోన్ లేకుండే మనిషి బ్రతకలేని స్దాయిలో ఉన్నాడు. పక్కలో పెళ్లాం లేకపోయిన ఫర్వాలేదు. రెండు పూటలా తిండి లేకపోయినా ఫర్వాలేదు. కానీ చేతిలో మాత్రం సెల్ ఉండవలసిందే.

 

 

ఇది కనుక ఓ క్షణం లేకుంటే ప్రపంచంలో తన కంటే అనాధ ఎవరు లేరనే భ్రమను కల్పించుకుని బ్రతుకుతున్నాడు మనిషి. ఇకపోతే ఒక బహిరంగ ప్రదేశంలో ఇద్దరు అతివలు వయ్యారాలు ఒలకబోస్తూ,సెల్ఫీ తీసుకుందామని, చేతిలోకి సెల్ తీసుకుని ఇలా ఫోజు పెట్టి రెడి అన్నారు. అలా దొంగ బైక్ మీద వచ్చి ఆ సెల్ ఫోన్‌ను కాస్త, కోతిలా వచ్చి తన్నుకు పోయాడు...

 

హాఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు బిత్తరపోయిన ఆ మహిళల తేరుకుని అరిచేలోపే రయ్యి మంటూ బైక్ పైన వేగంగా ఆ దొంగలు మాయమయ్యారు. ఇకపోతే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అందుకే చెబుతున్నాం సెల్ఫీ అభిమానులు రోడ్డుపై నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నారా? జాగ్రత్త.. మీకూ ఇలాంటి పరిస్థితి రావచ్చు... కాస్త ఆలోచించండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: