రోడ్దు మీద ప్రమాదాలు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్న కొందరు తెలివిలేని మూర్ఖుల వల్ల పక్కన ఉన్న వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.. ఎన్ని రూల్స్ తీసుకువస్తున్న వాహనాలు నడిపే వారి ప్రవర్తనలో అసలు మార్పు రావడం లేదు.. కనీసం ఇంట్లో నుండి బయటకు వెళ్లెటప్పుడైనా ఇలాంటి వారికి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాలనే ఆలోచన ఉండదేమో కావచ్చూ.. అతని తల్లి, పిల్లలు, భార్య అసలు గుర్తుకు రాదు కావచ్చూ.. విపరీతంగా మద్యం సేవించడం.. వాహనాలు నడపడం.. ఆ చచ్చే వాడు చావక ఎలాంటి తప్పు చేయని వారి ప్రాణాలు కూడా తీసుకు పోతున్నారు..

 

 

ఇలాంటి వారి విషయంలో కౌన్సిలింగ్‌లు పనిచేయడం లేదు.. అవగహన కార్యక్రమాలు ఎన్ని చేసిన మార్పు రావడం లేదు.. ఇక ఇక్కడ మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించి ఆ మత్తులో భయంకరమైన భీభత్సాన్ని సృష్టించాడు.. అతను నష్టపోక రోడ్డుమీద వెళ్లుతున్న వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవేసాడు.. పాపం స్కూలు నుండి సైకిల్‌పై వస్తున్న ఓ విద్యార్థినిని ఢీకొట్టాడు. అంతటితో అయినా మేలుకోలేదు.. అదే వేగంతో దూసుకెళ్ళుతూ, ఎదురుగా ఉన్న బైక్‌ను తప్పించబోయి, నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు విద్యార్థినులను అతి దారుణంగా ఢీకొట్టాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆ విద్యార్థినులు అమాంతం ఎగిరి పక్కనే ఉన్న కాలువలో పడ్డారు.

 

 

ఇకపోతే ఒళ్లు గగుర్లు పొడిచే ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అనఖా అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండగా.. అర్చన, చందనా, రాఖి అనే విద్యార్థినులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడని సమాచారం.. ఇకపోతే ఈ ఘటన కేరళలోని అలప్పుజాలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు... చూసారుగా మన తప్పులేకున్నా ఎదుటి వారు చేసే తప్పుడు పనుల వల్ల ఎలాంటి దారుణాలు సంభవిస్తున్నాయో.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: