రెండు రోజుల క్రితం కేరళలో ఏనుగు పై జరిగిన ఒక సంఘటన మరువకముందే మరోసారి మహారాష్ట్రలో ఓ శునకం పై క్రూరత్వం చూపించాడు ఒక దుర్మార్గుడు. ఇకపోతే నేడు తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...
In aurangabad, maharashtra two men on bike dragging a dog with a chain around his neck for at least a kilometre.
— Streetdogsofbombay #Feedastrayeveryday (@streetdogsof) June 7, 2020
FIR has been filed by local activist.
When will this stop?@AnushkaSharma @ShraddhaKapoor @rashmigautam27 @TheJohnAbraham @asharmeet02#saveanimals #JusticeforNandini pic.twitter.com/GXcTjXCt2O
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన శునకం మెడకు తాడు కట్టి, అతడు తన బండి పై కూర్చొని బండి వెనకాల ఆ శునకాన్ని కిలోమీటర్ దూరం మేరకు లాక్కొని వెళ్ళాడు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని ఆ బైక్ వెనకాల వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక అంతే ఈ వీడియో వైరల్ కాగా, అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది.
ఇకపోతే ఔరంగాబాద్ పోలీసులు సదరు వ్యక్తుల పై " జంతువుల పై క్రూరత్వం నివారణ చట్టం " కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు.