రెండు రోజుల క్రితం కేరళలో ఏనుగు పై జరిగిన ఒక సంఘటన మరువకముందే మరోసారి మహారాష్ట్రలో ఓ శునకం పై క్రూరత్వం చూపించాడు ఒక దుర్మార్గుడు. ఇకపోతే నేడు తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

 

 

మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన శునకం మెడకు తాడు కట్టి, అతడు తన బండి పై కూర్చొని బండి వెనకాల ఆ శునకాన్ని కిలోమీటర్ దూరం మేరకు లాక్కొని వెళ్ళాడు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని ఆ బైక్ వెనకాల వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక అంతే ఈ వీడియో వైరల్ కాగా, అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది.

 


ఇకపోతే ఔరంగాబాద్ పోలీసులు సదరు వ్యక్తుల పై " జంతువుల పై క్రూరత్వం నివారణ చట్టం " కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: