తయారీచేసేవిధానం : ప్యాన్లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన పండుమిర్చి ముక్కలు, పాలకూర, సగం జీలకర్ర, ధనియాలు దోరగా వేయించుకొవాలి. ఇందులో తగినంత ఉప్పు, నారతీసిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బుకున్న చింతపండును బౌల్ లోకి తీసుకోవాలి.
మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా బావుంటుంది.