మహిళల రక్షణ కోసం జగన్ సర్కారు మరో పథకం ప్రకటించింది. అభాగ్య, బాధిత మహిళలకు అండగా ఉండేందుకే సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. విశాఖలో మంత్రులు తానేటి వనిత, అవంతి శ్రీనివాస్‌ సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభించారు. సఖి వన్‌స్టాప్‌ సెంటర్లు ఐదు రకాల సేవలందిస్తాయని వారు వివరించారు.


లైంగికంగా, ఇతరత్రా వేధింపులకు గురయ్యే మహిళలు, 181 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చని మంత్రులు తెలిపారు. మహిళలలో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.


మహిళా సంక్షేమ ప్రభుత్వమని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. మహిళలకు అండగా ఉండేందుకు సఖి వన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మరి సఖి వన్ స్టాప్ సెంటర్లు ఎంత బాగా పనిచేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: