మనకు ఏదైనా లోన్ కావాలంటే బ్యాంకు కి వెళ్తాము..... ఆస్తులు, ధ్రువపత్రాలు ఎం లేకపోతె ఇంక తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులడుగుతాం.కానీ బ్యాంకు లో లోన్ ఇవ్వలేదని ఏకంగా బ్యాంక్ పెట్టేసింది మధ్యప్రదేశ్కు చెందిన ఆదివాసి వనిత.ఈ బ్యాంకు లో అందరు ఆడవాళ్లే పని చేస్తారు... పైగా ఏ షూరిటీ లేకుండానే లోన్ ఇస్తారు. మరి ఆ బ్యాంకు కథ ఏంటో తెలుసుకుందామా? 

మధ్యప్రదేశ్ బర్వాని జిల్లాలో గంధ్వాల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆదివాసి ప్రాంతం అది.అక్కడ రెవాబాయ్ అనే గిరిజన మహిళ సొంత వ్యాపారం చేయాలని తలచి రుణం కోసం ప్రైవేట్ బ్యాంక్ను ఆశ్రయించారు.
తన వద్ద ఎటువంటి ఆస్తులు, ధ్రువపత్రాలు లేనందున రుణం ఇవ్వటానికి తిరస్కరించింది ఆ బ్యాంకు. ఆ రోజు.. తన మనస్సులో బలంగా నాటుకుపోయింది. ఓ బ్యాంకు ప్రారంభించి తన లాంటి ఎంతో మంది వనితలు.. తమ కాళ్లపై నిలబడేందుకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు.

అలా 8ఏళ్ల క్రితం 12మంది మహిళలతో కలిసి 'సమృధి క్రెడిట్ సంస్థ' అనే బ్యాంకును ప్రారంభించారు. చిన్న మొత్తంతో ప్రారంభించిన బ్యాంకు ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి 100 కోట్ల టర్నోవర్కు తీసుకొచ్చారు.ఎంతో మంది మహిళలకు ఎటువంటి తాకట్టు, ధ్రువపత్రాలు తీసుకోకుండానే రుణాలు ఇవ్వటం ఈ బ్యాంక్ ప్రత్యేకత. ఇలా ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కరూ రుణాలు తిరిగి చెల్లించకుండా లేరు.8 ఏళ్ల క్రితం ఆ ఒక్క ఊరికే పరిమితమైన ఆ బ్యాంకు.. ఈ రోజు 715 గ్రామాల్లో సేవలను అందిస్తోంది. చుట్టు పక్కల 37 గ్రామాల్లోని 3000 మంది వనితలకు అండగా నిలిచింది.

ప్రతి శాఖలోనూ విధి నిర్వహణను మహిళలే చూసుకుంటున్న ఈ బ్యాంక్ లో ఇప్పటివరకు కోటి యాభై లక్షల రుణాల్ని మహిళలకు అందించారు.రెవాబాయి మెదటి సారి ఓ బ్యాంకు నుంచి రూ.1000 రుణాన్ని తీసుకున్నారు. ఆ రుణంతో కొన్ని కోళ్లను కొన్నారు. వాటి గుడ్లతో వ్యాపారం ప్రారంభించారు. అందులో వచ్చిన లాభాలతో మరింత రుణాన్ని తీసుకొని ఓ గేదెను కొన్నారు. అలా క్రమక్రమంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలు అంచెలుగా ఎదిగారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు రెవాబాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: