ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఎన్టీఆర్ భామ నటి సమీరారెడ్డి నిన్న మరోసారి ఇంస్టాగ్రామ్ లో తన కూతురు గురించి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా తన కుమార్తె ఫోటోలను చేస్తూ ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈమె గురించే ఉంటుంది. ఆ వ్యాఖ్యలు ఏంటో మీరు ఒకసారి చుడండి.. 

 

'పసిపాపతో ఉండటంతో చాలా సరదాగా, సంతోషంగా ఉంటుంది. కానీ, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన దేశంలో చాలా మంది ఆడపిల్లను భారంగానే భావిస్తారు, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం అలాంటి ఆలోచనా ధోరణి మారిందని అనుకుంటున్నా. అయితే, ఇప్పటికీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో తొలి కాన్పులో మగబిడ్డ కావాలని వారి కుటుంబాలు కోరుకుంటాయి. 

 

ముగ్గురు ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో ఒకదానినైన నేను మాత్రం ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. మేము అబ్బాయిలకంటే ఎక్కువే సాధించాం' అంటూ సమీరారెడ్డి ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. జై చిరంజీవ, నరసింహుడు, అశోక్‌ తదితర తెలుగు చిత్రాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.  

 

పెళ్లి అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. తన భర్త, తన పిల్లల ఫొటోలను ఎప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె స్విమ్మింగ్ ఫోటో షూట్ ఫోటోలపై విమర్శలు కూడా వచ్చాయి. 2013లో వ్యాపారవేత్త అక్షయ్‌ వాద్రాను వివాహం చేసుకున్న సమీరా రెడ్డికి 2015లో ఒక కుమారుడు జన్మించగా, ఈ ఏడాది జులైలో ఓ పాప జన్మించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: