మహిళా కానిస్టేబుల్ పై.. మరో కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన వీడియాలతో బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆ పోలీసు.. కామాంధుడిగా మారి సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషా జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆనంద్ గౌతమ్.. కొద్ది నెలల క్రితం భోపాల్ శివారులోని నజీరాబాద్ లో పీఎస్ లో చేరాడు. అదే స్టేషన్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ బస్ కోసం ఎదురు చూస్తుండగా... బైక్ పై వెళ్లిన కానిస్టేబుల్ ఆనంద్ గౌతమ్.. అక్కడికి వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడాడు. తనకు దాహంగా ఉందని మహిళా కానిస్టేబుల్ చెప్పడంతో దగ్గరలోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అనంతరం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు.

మత్తులోకి జారుకున్న మహిళా కానిస్టేబుల్ పై ఆనంద్ గౌతమ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తులో నుంచి బయటకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ అతన్ని ప్రశ్నించగా.. ఆసమయంలో తీసిన ఫోటోలు, వీడియోలతో బెదిరించాడు. ఈ వీడియోలతో ఆమెను పలుమార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట వారికి ఈ విషయం చెబితే ఫోటోలను సోషల్ మీడియాలో చెబుతానని హెచ్చరించాడు.

కొద్దిరోజుల క్రితం వేరే పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన ఆనంద్ గౌతమ్ తన బుద్దిని మార్చుకోకుండా మహిళా కానిస్టేబుల్ ను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో విసుకు చెందిన మహిళా కానిస్టేబుల్.. ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పి.. ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: