ఏ జంట అయినా పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటుంది. కొంతమంది అయితే తమ వివాహ వేడుక అందరికి గుర్తిండిపోయేలా వింతగా జరుపుకుంటారు. అదెలాగంటే.. కొందరు వివాహ వేడుకకి గుర్రాలపై వస్తారు. మరికొందరు కొత్తగా రెడీ చేసిన కారులో వెరైటీగా ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు గాల్లో తేలియాడుతూ రింగులు మార్చుకుంటారు. 

కానీ ఓ వధువు మాత్రం ఇంకాస్త వెరైటీగా తన పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ వైరల్ యుగంలో పెళ్లికి.. చావుకు పెద్ద తేడా తెలియకుండా పోతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. కారులో హూందాగా రావాల్సిన వధువు శవ పేటికలో పడుకుని వేదిక వద్దకు చేరింది. గుర్రాలు, కార్లను కాదని ఏకంగా శవపేటికలో పెళ్లి మంటపానికి వచ్చింది. శవపేటిక లోపలి నుంచి లేచి మంటపంపైకి వెళ్లింది. . 

ఓ వధువు శవపేటికలో పడుకొని ఉంది. ఆ శవపేటికపై నల్లటి వస్త్రం కప్పి ఉంది. కళ్యాణ మంటపం దగ్గరకి రాగానే ఆ వస్త్రాన్ని తొలగించారు. అనంతరం శవపేటికలోనుంచి వధువు నవ్వుతూ లేచింది. అందరూ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి వెళ్లి రింగులు మార్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘చావు కూడా మన జీవితంలో భాగమే.. అందుకే ఆమె శవపేటికలో వచ్చింది’  అని ఒకరంటే.. ‘పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే’  అంటూ మరొకరు కాంమెట్లు చేస్తున్నారు. 
చక్కగా పూలతో అలంకరించిన కారులోనో, రథం మీదో రావల్సిన వధువు శవ పేటికలో పడుకుని పెళ్లి మండపం వద్దకు వచ్చింది. పెళ్లిలోకి శవ పేటికను తెస్తున్నారేంటని ఆశ్చర్యపోయిన అతిథులు.. అందులో నుంచి పెళ్లి కూతురు నవ్వుతూ దిగడాన్ని చూసి అవ్వక్కయ్యారు.

ఇటీవల యూకేలో కూడా ఓ భిన్నమైన వివాహం జరిగింది. వరుడు పెళ్లి కుమార్తె దుస్తులను వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేడుకలో పెళ్లి కుమార్తె వరుడి దుస్తుల్లో మెరిసింది. ఈ జంపలకిడి పంబ పెళ్లి కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్నెట్ యుగంలో వైరలయ్యేందుకు చాలామంది ఇలా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ, మరీ ఇలా శవ పేటికలో పెళ్లికి రావడం అంటే కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. అంటే.. పెళ్లి తర్వాత ఇక లైఫ్ ‘అంతే’ అని సింబాలిక్‌గా చెప్పేందుకు ఇలా చేసి ఉంటారా..? ఈ పెళ్లిపై మీరు ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: