చలికాలం వచ్చిందంటే చాలు మనం తినే పండ్లలో సీతాఫలం ఒకటి కనిపిస్తది. సీతాఫలాన్ని ఒకొక్కరు ఒక్కోలా పిలుస్తారు. కొందరు సీతాఫలం అంటే మరికొందరు అమృతఫలం అని కస్టర్డ్ యాపిల్ అని ఇంకా షుగర్ యాపిల్ అని ఇలా రక రకాలుగా పిలుస్తుంటారు. ఈ ఫలాన్ని జ్యూస్ తాగకూడదు. అలా తాగడం వల్ల ఇందులో చక్కెర భాగం ఎక్కువగా ఉండడం వల్ల డూయాబెటిస్ పేషెంట్కి మంచిది కాదు. ఈ పండుని నేరుగానే తినాలి దాని వల్ల ఈ పండులోని గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బాగా పండిన తర్వాత మాత్రమే తినడానికి వీలవుతుంది. సీతాఫలం చుట్టూ కళ్లులాగా బెరడులాంటి పధార్థం ఉంటుంది. పండిన సీతాఫలంపై ఈ కళ్లను విడదీస్తే లోపల ఒక్కొక్క గింజ చుట్టూ తెల్లటి గుజ్జు మధురంగా ఉంటుంది. కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు.
ఇది రుచికరమైన పండు మాత్రమే కాదు, మన చర్మం, జుట్టు, కంటి చూపు, మెదడు మరియు హిమోగ్లోబిన్ స్థాయిలకు కూడా మంచిది. ఈ పండు గురించి సాధారణంగా చాలా మందిలో చాలా అపోహలు ఉంటాయి. సీతాఫాల్ లేదా కస్టర్డ్ యాపిల్ ఆగ్యప్రయోజనాలతో కూడిన పోషకాలు పుష్కలంగా ఉన్న పండు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం సీజన్ లో సీతాఫలం ఉంది. కాబట్టి, దీన్ని మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవడం మంచిది. ప్రఖ్యాత పోషకాహార నిపుణుడు రుజుడా దివేకర్ మీ ఆహారంలో సీతాఫంల చేర్చుకోవడం వల్ల దానికి యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
సీతాఫలం: 1. మధుమేహం ఉన్న వారు సీతాఫలంకు దూరంగా ఉండాలి..! సీతాఫలం 54 గ్లైసెమిక్ సూచిక కలిగిన పండు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది సురక్షితమైన పండు కాదు. అదనంగా, డయాబెటిస్ ఉన్నవారికి జిఐ 55 మరియు అంతకంటే తక్కువ ఉన్న వారికి దీన్ని తినవచ్చని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 2. గుండె సంబంధిత సమస్యలున్న రోగులు సీతాఫలంకు దూరంగా ఉండాలి..? వాస్తవంగా చెప్పాలంటే సీతాఫలం డయాబెటిస్ వారికి కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మాంగనీస్ మరియు విటమిన్ సి వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ కోసం, ఈ పండు మీ ఆహారంలో భాగం కావడం చాలా మంచిది. 3. సీతాఫలం జీర్ణక్రియకు మంచిది ..! ఇక్కడ ఉన్న అపోహ ఏమిటంటే, అధిక బరువు ఉన్నవారు ఈ పండును నివారించాలని నమ్ముతారు.
అయితే వాస్తవంగా చెప్పాలంటే సీతాఫలం జీర్ణక్రియకు మంచిది మరియు మంటను తగ్గిస్తుంది. ఇది కడుపులో ఆమ్లతను నివారిస్తుంది మరియు కడుపులో ఇన్ఫ్లమేషన్ నయం చేస్తుంది. విటమిన్ బి, విటమిన్ బి కాంప్లెక్స్ కు మంచి మూలం, ముఖ్యంగా విటమిన్ బి 6. ఇవన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 4.పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫల్కు దూరంగా ఉండాలి ..? ఇది సీతాఫలం గురించి మరొక ప్రసిద్ధ అపోహ. పిసిఒడి ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం. అందుకు మంచి మూలం సీతాఫలం , పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపులు చెబుతున్నారు. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు చిరాకును తగ్గిస్తుంది.