హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం ప్రతి ఒక్కరినీ కదిలించింది. కామంతో కళ్లుమూసుకుపోయిన నాలుగు మానవ మృగాలు ఆమెను అత్యంత కిరాతంగా రేప్ చేసి చంపేశాయని తెలిసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. ఇలాంటి పాపానికి ఒడిగట్టిన ఆ నలుగురు దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ హత్యపై సామాన్య ప్రజల నుంచి సినీ, రాజయకీయ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు

 ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇరుక్కున్నారు అనేకంటే ఇరికించారు అంటే కరెక్ట్‌గా ఉంటుందేమో. శంషాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ రేప్ కేసుపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే స్పందించారు. ఆయన కేవలం రేప్‌పై స్పందించి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. కానీ ఈ రేప్ విషయంలోనూ సందీప్ రెడ్డి వంగాను ఇరికించారు. వెటర్నరీ డాక్టర్ రేప్ విషయంపై సందీప్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 


‘సమాజంలో కొన్ని మార్పులు భయంతోనే మొదలవుతాయి. భయం అనేది కొత్త రూల్‌గా మారాలి. కఠినమైన శిక్షలు గుణపాఠాలుగా మారతాయి. దేశంలోని ప్రతీ ఆడపిల్ల తాను సమాజంలో ధైర్యంగా తిరిగేలా ప్రతీ సంఘం గ్యారెంటీ ఇవ్వాలి. వరంగల్ పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని పేర్కొ్న్నారు. ఈ ట్వీట్‌పై దర్శకుడు విక్రమాదిత్య స్పందిస్తూ సందీప్‌ను మళ్లీ పాత వివాదంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. సందీప్ తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమాలో హీరో హీరోయిన్‌ను కొట్టే సన్నివేశాన్ని ప్రస్తావించారు. 

‘సందీప్ జీ.. ఆ భయం అమ్మాయిని కొట్టకుండా ఆపుతుందా?’ అని వెటకారంగా ప్రశ్నించారు. ‘కబీర్ సింగ్’ సినిమాలో హీరో షాహిద్ కపూర్.. ఓ సన్నివేశంలో హీరోయిన్ కియారా అడ్వానీని చెంపపై కొడతాడు. ఈ సన్నివేశంపై పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇలాంటి సినిమాను తీసిన సందీప్ రెడ్డిపై చాలా మంది విరుచుకుపడ్డారు. ఇప్పటికీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ రేప్ ఘటనను సినిమాకు ముడిపెట్టి దర్శకుడు విక్రమాదిత్య పొరపాటు చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: