పచ్చి మిర్చి.. తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. కొంతమంది అసలు కారం లేకుండా తింటుంటారు. కానీ కారం లేకుండా తిన్నారంటే కొద్ది రోజులకు నాలుక చప్పబడిపోతుంది. అందుకే పచ్చి మిర్చి చట్నీని ఎలా చెయ్యాలి.. ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఈ పచ్చిమిర్చి చట్నీ ఎంత బాగుంటుందో తెలుసా ?

                            

కావలసిన పదార్థాలు... 

                               

పచ్చిమిర్చి - 200గ్రా., 

 

నిమ్మరసం - 50 మి.లీ., 

 

కారం - 1 టీ స్పూను, 

 

మెంతులు - అర టేబుల్‌ స్పూను, 

 

ఆవాలు - అర టేబుల్‌ స్పూను, 

 

పసుపు - 1 టీ స్పూను, 

 

వేగించిన జీరాపొడి - 2 టీ స్పూన్లు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.

 

తయారుచేసే విధానం..

 

మెంతులు, ఆవాలు పొడిచేసి అందులో కారం, పసుపు, జీరాపొడి, ఉప్పు కలపాలి. సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని గింజలు తీసేసి నిమ్మరసంలో గంటసేపు నానబెట్టాలి. కాగబెట్టిన నూనెలో పొడుల మిశ్రమాన్ని వేసి అందులో పచ్చిమిర్చిముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ చట్నీని గాజుజాడీలో పెట్టి 5 రోజుల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ చట్నీ అన్నంలోకి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. అది ఎంత రుచిగా ఉంటుంది అంటే తినేకొద్దీ తినాలి అనిపిస్తుంది. చెప్పబడిన నాలుక ఒక్కసారిగా రాయలసీమను గుర్తుతెచ్చుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: