భార్య భర్తల బంధం ఎంత పవిత్ర మైనదో మన అందరికి తెలుసు.. ఇద్దరిమీద ఒకరికి ఒకరికి నమ్మకం ఉండాలి. కాని ఒక శాడిస్టు  భర్త పెట్టె బాధలు తట్టుకోలేక విడిపోవాలని అనుకుంది. అది భరించలేని భర్త, తమ ఏకాంత  విడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. వివరాలలోకి వెళితే.....


విశాఖ పట్నం లోని పాడేరు కి చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త చిన్న వయసులోనే  మరణించాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. భర్త మరణించాక ఇద్దరు పిల్లలతో జీవితం కొనసాగిస్తోంది.  ఈ మహిళ పాడేరు లోని  సినిమా హల్ సెంటర్ లోని గాడి కాలనీలో నివాసం ఉంటుంది.

 

ఇల్లు మరమ్మతుల నిమిత్తం గోదావరి జిల్లా పెద్దాపురం మండలం, దివిలి గ్రామ అనంత్ అచ్యుత్ కుమార్ అనే తాపీ మేస్త్రీ ని కలిసింది. ఆమె ఇంట్లో పనికి వస్తు మాయమాటలు చెప్పి, తనదారికి తెచ్చుకున్నాడు. దింతో 2019 లో ఇరువురు పెళ్లిచేసుకున్నారు. పెళ్లయిన కొద్దికాలానికే వేధింపులు పెట్టాడు, పిల్లలని, భార్యని కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది.


భర్త మీద కేసు పెట్టింది. దీనితో కోపంతో పెళ్లితర్వాత ఇద్దరు ఏకాంతం గా ఉన్న వీడియోలు చూపించి భయపెట్టాడు. అంతటితో ఆగకుండా వీడియోలను వాట్స్ అప్, ఫేస్బుక్, నెట్ లో అప్లోడ్ చేసాడు. దీనితో పోలీసులు దేహశుద్ది చేసి, కేసు నమోదు చేసి విశాఖ సెంట్రల్ జైల్లో పెట్టారు..

పాపం చిన్న వయసులో పెళ్ళిచేసారు ఒక భర్తని కోల్పోయింది.. రెండోసారి కూడా విధివంచన కి గురిఅయింది ఈ అభాగ్యురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: