కొన్ని  కొన్ని సార్లు మనం ఇలాంటి వార్తలు వింటే.. ఈ లోకం ఎటుపోతుందా.. అసలు ఏమైపోతుంది.. అనే ఆందోళన కలుగుతుంది. మరోవైపు ప్రపంచంలో అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా..? అని మనకి మనమే నమ్మలేకపోతుంటాము.. కానీ నిజంగానే అలాంటి వ్యక్తులు ఉంటారు. ఉన్నారనటానికి నేను చెప్పే వార్త చదివితే తప్పకుండా మీకు గుండె బరువెక్కుతుంది.

 

లిసా రాచెల్లే స్నేడర్ (36) అనే మహిళ సెప్టెంబరు 23 న 911 ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసింది. తన బిడ్డలిద్దరూ బేస్‌ మెంట్‌లో ఉరి వేసుకున్నారని, తనకు ఏం చేయాలో అర్థం కావడంలేదంటూ ఏడుస్తూ చెప్పింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని పిల్లలను రక్షించారు. కానీ, బ్యాడ్ లక్.. కొద్ది రోజులు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతో బతికిన ఆ చిన్నారులు మూడు రోజుల తర్వాత తుది శ్వాస విడిచారు. 

 

లిసా తన కొడుకు కాన్నర్(8), కుమార్తె (4)బ్రన్లేలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. చిన్నారుల మరణం తర్వాత పోలీసులు లిసాను విచారించారు. తాను మాట్లాడుతూ.. తన కొడుకు కాన్నర్ డిప్రషన్‌తో బాధపడుతున్నాడని, తాను ఒంటరిగా చనిపోతానేమో అని భయమేస్తోందని, చెల్లిని కూడా చంపేస్తానని అనేవాడని పేర్కొంది. చివరికి భయపడినట్లే చేశాడని తెలిపింది. ఆ రోజు తాను బేస్‌మెంట్‌లోకి వెళ్లి చూస్తే.. ఇద్దరూ కుక్క బెల్టుకు వేలాడుతూ కనిపించారని, అప్పటికే వారు చనిపోయారని భావించానని తెలిపింది. 

 

పోలీసులు అంత చిన్న పిల్లలు ఎలా ఆత్మహత్య చేసుకుంటారని భావించి ఆ చిన్నారులను కావాలనే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారించారు. వాళ్ళు ఉరి వేసుకున్న ఆ కుక్క బెల్టును ఎక్కడ కొన్నారు..? ఎవరు కొన్నారో పోలీసులు తెలుసుకోవాలనుకుని  బెల్ట్ గురించి షాప్స్ లో ఆరా తీయటం మొదలు పెట్టారు. వారికి తెలిసిందేమిటంటే.. ఆ పిల్లలు ఉరివేసుకున్న రోజే ఓ మహిళ ఆ బెల్టును కొనుగోలు చేసిందని తెలిసింది. ఆ బెల్టు కొనుగోలు చేసిన మహిళ మరెవ్వరో కాదు.. ఆ పిల్లల తల్లి లిసా. పైగా, పోస్టుమార్టం రిపోర్టులో వారికి ఎవరో ఉరి బిగించారని తేలింది. ఈ రెండు ఆధారాలతో లిసానే తన ఇద్దరి పిల్లలను చంపి ఉంటుందనే అనుమానంతో పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు. డిసెంబరు 2న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె తాను హత్య చేయాలేదని చెబుతోంది.

 

కానీ, లిసా తన ఒంటరి జీవితాన్ని కుక్కతో పంచుకుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో కొన్ని ఆధారాలు లభించాయి. ఆమె కుక్కతో సెక్స్ జరిపేదని, ఆ ఫొటోలను తన స్నేహితులకు పంపేదని పోలీసులు తెలిపారు. ఆ బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతోనే ఆమె ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమె నోరు విప్పితే గానీ అసలు విషయం తెలియదు. ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: