దిశ, ఉన్నావ్ సంఘటనలు మరిచిపోక ముందే మరో బాలిక మృగాళ్ల చేతుల్లో బలైపోయింది. ఈ ఘటన త్రిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక (17)ను ఆమె ప్రియుడు బంధించి అతను, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2 నెలల అనంతరం ఆమెకు నిప్పటించారు. శనివారం తీవ్రగాయాలతో హాస్పిటల్‌ లో చేరిన బాలిక చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిందితుని ఇంట్లో మంటల్లో కాలిపోయే ఆ బాలికను ఇరుగు పొరుగు వారు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు తన తల్లితో కలిసి బాలికకు నిప్పంటించినట్టు తెలుస్తోంది.

 

గత రెండు నెలలుగా బాలిక ప్రియుడు ఆ ఇంట్లో బంధించాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతిచెందిన వార్త దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తును జనం హాస్పిటల్‌కు తరలివచ్చి నిందితులపై దాడి చేశారు. నిందితుడు అజయ్ రుద్రపాల్‌ తమ కుమార్తెను బంధించి రూ.50,000 డిమాండ్ చేశాడని, తాము రూ.17,000 ఇచ్చామని బాధితురాలి కుటుంబం తెలిపింది. శుక్రవారం సాయంత్రం బాలికకు నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికకు నిందితుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడని, దీపావళి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని పోలీసులు వివరించారు. తర్వాత బాలికను కిడ్నాప్ చేసి బంధించి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడని తెలిపారు.

 

బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తర్వాత నిందితుడు ఫోన్ చేసి రూ.50,000 ఇస్తే మా కుమార్తెను వదలి పెడతానన్నాడని, అప్పుడు పోలీసుల్ని సంప్రదించినా ఎలాంటి సాయం చేయలేదన్నారు. దీంతో శుక్రవారం రాత్రి అజయ్ తల్లికి ఓ చోట కలిసి రూ.17,000 చెల్లించినా ఆమె సంతృప్తి చెందలేదు సరికదా, మీ కూతుర్ని విడిచిపెట్టాలంటే పూర్తిగా డబ్బు చెల్లించాలని హెచ్చరించిందన్నారు. వారి అడ్రస్ గురించి తెలిసి శనివారం ఉదయం వెళ్లడానికి సిద్ధమవుతుండగా, కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేర్పించినట్టు తెలిసిందన్నారు.

 

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులను సంప్రదించినా వారు స్పందించలేదని, హాస్పిటల్‌కు వెళ్లేసరికి తమ కుమార్తె చావుబతుకుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, వేధింపులకు గురిచేశారని చెప్పిందన్నారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్ సంస్థలో పనిచేసే నిందితుడు అజోయ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమ్యాడని, తర్వాత ఇంటికి వచ్చాడని బాధితురాలు తన వాంగ్మూలంలో తెలిపింది. మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్లాడని, రెండు రోజుల తర్వాత అజయ్‌, అతడి తల్లి వేధించడం మొదలుపెట్టారని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: