మన గౌరవనీయులయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు  అయిన  జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువత కోసం ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలగచేసారు. గ్రామ లేదా వార్డ్ వాలంటీర్లను లక్షల సంఖ్యలో నియమించారు.. ప్రతి 50 లేదా 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ ని నియమించారు... అన్ని ప్రభుత్వ పధకాలు ఇంటి దగ్గరకి వచ్చి చేసే భాద్యత వాలంటీర్ దే.

 కాని ఒక వాలంటీర్ ప్రబుద్దుడు మాత్రం తన భాద్యత ని మర్చిపోయి ఒక మహిళ పై అఘాయిత్యం చేసాడు. వివరాలలోకి వెళితే.. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం లోని మహిళపై అత్యాచారం చేసాడు.. రైతు భరోసా కి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పుస్తకం, పొలం పట్టాదారు కాగితాలు తెమ్మని కలిగిరి మండలానికి చెందిన ఒక గ్రామ వాలంటీర్ సోమవారం రాత్రి 7.30 కి మహిళకి ఫోన్ చేసి కాగితాలు తెమ్మన్నాడు..

దింతో రాత్రివేళ ఒక్కటే ఒంటరిగా వాలంటీర్ ఇంటికి వెళ్ళింది. తన భర్త పని మీద చైన్నె వెళ్లడంతో, ఒక్కటే ఇంటికి వెళ్ళింది.. కాగితాలు చూపించి, కొన్ని డీటెయిల్స్ ఇచ్చి వెళ్లిపోతుండగా చెయ్యి పట్టుకుని గదిలోకి లాగి తలుపు వేసి అత్యాచారం చేయబోయాడు.

తాను చెప్పినట్లు విని తన కోరిక తీరిస్తే అన్ని ప్రభుత్వ పధకాలు నీకు అందేలా చేస్తానని ప్రలోభపెట్టాడు... కాని ఆ మహిళ వ్యతిరేకించి, గట్టిగా అరవడంతో భయపడిపోయి ఆమెను వదిలేసాడు. దింతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.. జరిగినదంతా ఫోన్ లో తన భర్తకి వివరించింది..

మరుసటి రోజు అనగా మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.. వాలంటీర్ మీద కేసు నమోదు చేసుకున్న ఎస్ ఐ ఆదిలక్ష్మి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.. దేశంలో ఎక్కడో చోట ఎదో ఒక రూపంలో మహిళలపై లైగింక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కాని మార్పు అనేది రావడం లేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: