సభ్యసమాజం తలదించుకునేలా తన మైనర్ కూతుర్ని బలవంతంగా తన ప్రియుడు వద్దకు పంపించిన మాతృమూర్తి ఉదంతమిది.  కన్న తల్లి సాక్షిగా ఒక రాత్రి మొత్తం మైనర్ బాలికకు నరకం చూపించిన తంగిరాల రాంబాబు అనే 56 ఏళ్ల వృద్ధుడు. అభివృద్ధి మాటున నానాటికి  మానవత్వం మంటగలిసి పోతుంది. ముఖ్యంగా ఈజీ మనీ వ్యామోహంలో పది ఉచ్ఛనీచాలను విస్మరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జరిగిన సంఘటన గగుబాటును కలిగిస్తుంది.  దిశా యాక్ట్ అమలులోకి వచ్చిన రోజున ఈ దారుణం జరగడం గమనార్హం.

బాలిక తండ్రి చనిపోవడంతో  వెంటనే తన నానమ్మ వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్న పద్నాలుగేళ్ల మైనర్ బాలిక. మైనర్ బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలిక తల్లి కటారపు మార్తమ్మను పోలీసులు అదుపులోకి తీసుకోగా తంగిరాల రాంబాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఈ సంఘటనపై  ఫోక్స్ యాక్ట్ క్రింద కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో ఇంకో క్లూ దొరికినట్టుగా తెలుస్తుంది. 


దిశలో మరో ఆధారం..
దిశపై హత్యాచారం కేసులో తెలంగాణ పోలీసులకు మరో ఆధారం లభించింది. అత్యాచారం చేసిన సమయంలో నిందితులు బలవంతంగా దిశ నోట్లో మద్యం పోసినట్లు పోలీసులు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. నిందితులు నేరాంగీకార వాంగ్మూలంలోనూ ఈ విషయం వెల్లడించినట్లు రిమాండ్‌ డైరీలో పోలీసులు తెలిపారు. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు. దీన్ని బట్టి నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారనే విషయం స్పష్టమవుతోంది. ఘటనాస్థలంలో లభించిన దిశ లోదుస్తులపై నిందితుల వీర్యకణాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: