హైదరాబాద్‌ నగరంలో మరో ఘోరం జరిగింది. ఆలస్యంగా దారుణ ఘటన వెలుగు చూసింది.. దిశ ఉదంతం మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన అక్కాచెల్లెళ్లను ఇద్దరు వ్యక్తులు మభ్యపెట్టి దారి మళ్లించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట చౌరస్తాకు సమీపంలోని హాషామాబాద్‌లో నివసించే ఓ బాలిక(18) ఆమె చెల్లెలు(10) రెండు రోజుల క్రితం చార్మినార్ వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై నిల్చున్నారు. అదే సమయంలో వారివద్దకు వచ్చిన ఆటోడ్రైవర్ మహ్మద్‌ ఆమెర్‌ తాను తీసుకెళ్తానని ఆటో ఎక్కించుకున్నాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో..


అక్కడి నుంచి తమను జహంగీర్‌పీర్‌ దర్గాకు తీసుకెళ్లాలని చెప్పడంతో సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం సురక్షితం కాదని చెబుతూ వట్టేపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.రాత్రికి అక్కడే పడుకుని ఉదయం వెళ్లాలని సూచించి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఆటో డ్రైవర్ అయిన ఆమెర్‌ సోదరుడు మూసా వారిని తన బైక్‌పై రాత్రి సమయంలో నాంపల్లికి తీసుకెళ్లాడు. మాయమాటలతో వారిద్దరినీ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ కోరిక తీర్చాలంటూ అక్కను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చెల్లెలిని చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అమీర్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించరు. ఈలోగా ఇద్దరు బాలికలు కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాంపల్లిలో ఇద్దరు బాలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి వారిద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో బాలిక(18) తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పడంతో పోలీసులు మూసాతో పాటు ఆటోడ్రైవర్‌ ఆమెర్‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అత్యాచారం కేసులో నిందితులను రిమాండ్ కు తరలిస్తున్న చాంద్రాయణగుట్ట పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి: