ఇటీవల జరిగిన దిశ హత్యాచార ఘటన మరువకముందే ఇలాంటి సంఘటనలు వేల సంఖ్యలో జరుగుతున్నాయి. దిశ హత్యాచార నలుగురు నిందితులపై ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో యావత్తు దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇంకా ఆ నలుగురు మృతదేహాలకు అంత్యక్రియలు జరగనేలేదు. ఇంత జరిగినా కామాంధులు తమ పైశాచికత్వాన్ని వీడట్లేదు. చిన్న, పెద్ద, ముసలి అని చూడకుండా వారి కామవాంఛలను తీర్చుకుంటున్నారు కొంతమంది కామాంధులు.. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. 


వివరాల్లోకి వెళితే... కరీంనగర్‌ జిల్లాలో ఓ కామాందుడు నిండు గర్భిణి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం కొన్నేళ్లుగా బొమ్మకల్‌ గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా.. అతడి భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన భర్త ఉద్యోగానికి వెళ్ళాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. 


మధ్యాహ్న సమయంలో డిష్ రిపేర్ పేరిట ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ అనే వ్యక్తి మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. దీంతో ఆమెను బెదిరించి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె భర్తకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఆ కామాంధుడితో పెనుగులాటలో మెడలోని పుస్తెలతాడు తెగిపోవడంతో బాధితురాలు దాన్ని కట్టుకుంటున్న సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. ఆమె మెడపై గాయాలు కనిపించడంతో, ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి అతడు ఏం జరిగిందని నిలదీయగా బాధితురాలు జరిగిన విషయాన్ని చెప్పింది. 


ఇది బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన దంపతులు కొద్దిరోజులు ఎవరికీ చెప్పలేదు. అయితే సోమవారం కరీంనగర్‌ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు మొబైల్‌ ద్వారా వీడియో రికార్డ్ చేశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు దీనిపైనా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: