దేశంలో రోజురోజుకీ ఆడవాళ్లపై అత్యాచారాలు రేప్ లు హత్యలు పెరిగిపోతున్న కొత్త కొత్త చట్టాలు వస్తున్న సమాజంలో ఎటువంటి మార్పులు రావటం లేదు. రోజు రోజుకి ప్రపంచం మారిపోవటం కొత్త కొత్త టెక్నాలజీ తో మనిషి జీవితంలో కొత్త కొత్త మార్పులు రావటం తో పాటుగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న... మనిషిగా ప్రవర్తించటం లో మనిషి రోజు రోజుకి అడవిలో ఉన్న మృగాల కంటే దారుణంగా దిగజారి మరి ప్రవర్తిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనం తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన. కరీంనగర్ జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ గర్భిణీ దళిత మహిళ పై అదే ప్రాంతంలో పనిచేసే ఒక వర్కర్ తన ఫోన్ ఆన్ చేసి వీడియో ఆప్షన్ ముందే ఓపెన్ చేసి ఆ గర్భిణి అయిన దళిత మహిళ ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో రేప్ చేస్తూ ఫోన్ కెమెరాతో వీడియో తీసి పైశాచికత్వం గా ప్రవర్తించాడని తాజాగా వార్త వెలుగులోకి వచ్చింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9 నెలల గర్భిణిపై అదే ప్రాంతంలో పనిచేసే వర్కర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి.. అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పింది భార్య. దీంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

 

కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మొత్తం విషయం తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతం లో ఉన్న మహిళలు ఇలా అయితే ఆడదాని జాతి భారతదేశంలో ఉండదని కనుమరుగవడం ఖాయమని నిందితుడికి భయంకరమైన శిక్ష వేయాలని అతని అసలు మనిషి రూపంలో ఉన్న మృగం అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: